Breaking News

నూతన వ్యవసాయానికి మేం రెడీ

సారథి న్యూస్, రామాయంపేట: సీఎం కేసీఆర్ సంకల్పించిన నియంత్రిత సాగు విధానానికి తాము రెడీ.. అంటూ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం, కె.వెంకటాపూర్ గ్రామస్తులు బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ మాట్లాడుతూ.. వానాకాలంలో మక్క పంటను వేయమని, అధికారుల సూచనల మేరకు పంటలను వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచ్ అనిల్ కుమార్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, గ్రామస్తులు దయాకర్, ఎంపీపీ, జడ్పీటీసీ పాల్గొన్నారు.