![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/GANGGGSS.jpg?fit=640%2C430&ssl=1)
భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ జంటలను బెదిరించి వారివద్ద డబ్బు, నగలు దోపీడి చేస్తున్న ఓ ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. రేగళ్ల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా వీరు పట్టుబడ్డారని చెప్పారు. జిల్లాకు చెందిన ఓ ఆరుగురు ముఠాగా ఏర్పడి ప్రేమజంటలను కత్తులు, మారణాయుధాలతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరిపై దోపీడీ, దొంగతనం కేసులున్నాయని సీఐ అశోక్చ ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. వీరి వద్ద నుంచి 10 తులాల బంగారం, రెండు బైకులు, రెండు కత్తులు, రూ. 3000 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పట్టుబడిన నిందితులను మహమ్మద్ బాబ్జి అలియాస్ బ్లేడ్ బాబ్జి, గిరిమల్ల భరత్, మచ్చ రాజేందర్, షేక్ ఇమ్రాన్ అలియాస్ షకీల్, బజ్జర్ల రాజు, ఏరువ ఉదయ్కుమార్గా గుర్తించామన్నారు.