Breaking News

దళిత యువకుడి హత్యోదంతంపై విచారణ

సారథి న్యూస్, కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం మర్రిపల్లిలో ఇటీవల దళిత యువకుడు కిరణ్ హత్యకు గురయ్యాడు. హత్యకు దారితీసిన ఘటనను సంబంధించిన వివరాలను శనివారం ఎమ్మార్పీఎస్​ అధినేత మందకృష్ణ మాదిగ తెలుసుకున్నారు. ఈ హత్యోదంతంపై న్యాయవాదులతో చర్చించారు. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూనే వారితో మాట్లాడారు. ‘మాదిగ యువకుడు కిరణ్ హత్య కేసులో ఏసీపీ, సీఐ, రైటర్ కూడా నిందితులే, నిందితులకు సహకరించిన వారిని వదిలిపెట్టం. పోలీస్ అధికారులే ఉద్దేశపూర్వకంగా కేసును పక్కదారి పట్టించారు. నిందితులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం’ అని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. అనంతరం ఆయన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో విలేకరులతో మాట్లాడారు.