![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/TEJA-2f.jpg?fit=680%2C482&ssl=1)
తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందనున్న సినిమా ‘అలమేలుమంగ వెంకటరమణ’ సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చింది. నిజానికి గోపీచంద్కు నటుడిగా హైప్ ఇచ్చింది తేజానే. కానీ తేజ చిత్రాలైన ‘జయం, నిజం’ లో గోపీచంద్ విలన్ పాత్రలే చేశాడు. మొదటిసారి తేజ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయ్యిందని.. కథకు బలం హీరోనే పాత్రే అని.. ఇది గోపీచంద్కు పూర్తిగా సూటయ్యేట్టు తేజ గోపీచంద్ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట తేజ. అన్నీ కుదిరితే డిసెంబర్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కించే అవకాశముందట. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో విలన్ గా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈ సారి హీరోగా తేజ దర్శకత్వంలో సూపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఇందులో గోపీచంద్ కు జోడీగాఅలిమేలు మంగ పాత్రలో సాయిపల్లవి నటించనుందని ఫిల్మ్ నగర్ టాక్. గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ బేస్డ్ సినిమా ‘సీటీమార్’ చేస్తున్నాడు.