![తెలంగాణలో 7 పాజిటివ్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/IMG-20200425-WA0031.jpg?fit=720%2C568&ssl=1)
సారథి న్యూస్, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో శనివారం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఉదయం ఆరు కాగా, సాయంత్రం ఒకటి చొప్పున కేసు నమోదైంది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 మంది చనిపోయారని పేర్కొంది. 307 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇప్పటి వరకు 990 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.