సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,873 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,24,963 కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 9 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 827కు చేరింది. వ్యాధి బారినపడి నిన్న ఒకరోజే 1,849 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 92,837 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31,299 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 76.55 శాతంగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 73.3 శాతం ఉంది. దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల రేటు 1.78 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం 0.66శాతంగా నమోదైంది. కాగా, 24 గంటల్లో 37,791 కోవిడ్ టెస్టులు చేయగా, ఇప్పటివరకు 13,65,582 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 360 కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం 51, జగిత్యాల 77, జనగామ 34, జోగుళాంబ గద్వాల 28, కామారెడ్డి 25, కరీంనగర్180, ఖమ్మం 103, మహబూబ్నగర్40, మహబూబాబాద్54, మంచిర్యాల 48, మల్కాజిగిరి 41, నాగర్కర్నూల్36, నల్లగొండ 79, నిజామాబాద్ 94, పెద్దపల్లి 29, సిరిసిల్ల 23, రంగారెడ్డి 129, సంగారెడ్డి 37, సిద్దిపేట 85, సూర్యాపేట 65, వరంగల్అర్బన్94 చొప్పున పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.