న్యూఢిల్లీ: ఢిల్లీ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత లేదని, హాస్పిటల్స్ వర్గాలు కావాలనే అబద్ధాలు చెబుతున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాలు చెప్పారు. కరోనా లక్షణాలతో వచ్చిన వాళ్లను ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని, వెనక్కి తిప్పి పంపితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించారు. బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను తెలుసుకునేందుకు ఢిల్లీ సర్కార్ మొబైల్ యాప్ను లాంచ్ చేసిందని, దాని ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. కొన్ని హాస్పిటల్స్లో బెడ్లు ఖాళీ ఉన్నట్లు యాప్లో చూపిస్తున్నా లేవని చెబుతున్నారని, అలా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు.
‘నాకు కొన్నిరోజుల టైం ఇవ్వండి. ఈ బెడ్ల బ్లాక్ మార్కెటింగ్ను అరికడతాను’ అని కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు. ఢిల్లీలో కరోనా పేషెంట్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, సరిపడా వెంటిలేటర్లు, ఆస్పత్రులు, ఐసీయూలు అందుబాటులో ఉన్నాయన్నారు. యాప్లో ఖాళీలు ఉన్నట్లు చూపి, పేషెంట్లను చేర్చుకోకపోతే 1031 నంబర్కు కంప్లైంట్ చేయాలని కేజ్రీవాల్ కోరారు.