Breaking News

డ్రిప్​ ద్వారా సమృద్ధిగా పంటల సాగు

డ్రిప్​ ద్వారా సమృద్ధిగా పంటల సాగు

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చని, అందుకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఏపీ ఎంఐపీ ఏపీడీ బి.సుదర్శన్‌ రైతులకు సూచించారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎర్రకోటలో డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానాన్ని ఏపీడీ పరిశీలించారు. పంటసాగులో మొక్క మొక్కకు కావాల్సిన నీరు అందించేందుకు పైపు ఏర్పాటుచేసిన విధానం, మొక్కలను కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తదితర అంశాలను రైతు ఏపీడీ బి.సుదర్శన్‌ వివరించారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.