Breaking News

టీ20 వరల్డ్​ కప్ డౌటే

బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్​ అన్షుమన్ గైక్వాడ్

న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే టీ20 ప్రపంచకప్ జరగడం అనుమానమేనని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్​ అన్షుమన్ గైక్వాడ్ అన్నాడు. ఈనెల 28న ఐసీసీ సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలన్నాడు. ఒకవేళ ఏవైనా కారణాలతో మెగా ఈవెంట్ వాయిదా పడితే.. ఐపీఎల్​ కు మార్గం సుగమమవుతుందన్నాడు. ‘ఐపీఎల్​కు విండో దొరికినా.. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ఐపీఎల్ భవిష్యత్ అప్పుడే తేలుతుంది. భారత్​ లో అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే లీగ్ జరుగుతుంది. ఇక కరోనా దెబ్బతో క్రికెట్​లో చాలా మార్పులు వస్తాయి. వీటన్నింటికి క్రికెటర్లు మానసికంగా సిద్ధం కావాలి. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లు ఆడాలి. ఇది కష్టమే అయినా అలవాటు పడాల్సిందే. మొత్తానికి క్రికెట్ మొదలుకావడానికి మరో నాలుగు నెలల సమయం పడుతుంది’ అని గైక్వాడ్ పేర్కొన్నాడు.