Breaking News

‘జైశ్రీరామ్​’ నినాదం విశ్వవ్యాప్తమైంది

జై శ్రీరారం నినాదం విశ్వవ్యాప్తం

అయోధ్య: భారతీయ జాతీయభావాలకు, సంస్కృతికి అయోధ్య రామాలయం ఓ ప్రతీక అని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. అయోధ్య పోరాటం భవిష్యత్​ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. బుధవారం ఆయన అయోధ్యలో రామాలయానికి భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇవాళ జైశ్రీరామ్ అనే నినాదం అయోధ్యలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తోందని మోదీ అన్నారు. ‘ప్రతి గుండె ఉప్పొంగుతోంది. ఇది యావద్దేశం భావోద్వేగంతో పులకిస్తున్న వేళ. సుదీర్ఘ నిరీక్షణ ఈ రోజుతో ముగిసింది. రామ్‌ లల్లా కోసం భవ్య రామాలయం నిర్మాణం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా రామ్ లల్లా ఆలయం టెంట్‌లోనే కొనసాగింది’ అని మోదీ అన్నారు. పడవ నడిపే వ్యక్తి నుంచి గిరిజనుల వరకూ శ్రీరాముడికి ఏ విధంగా సాయపడ్డారో, కృష్ణ భగవానుడు గోవర్ధన గిరి ఎత్తడానికి పిల్లలు ఏ విధంగా సహకరించారో, మన అందరి సహాయ సహకారాలతో భవ్య రామాలయ నిర్మాణం పూర్తవుతుందని మోడీ అన్నారు.