సారథి న్యూస్, కర్నూలు: మాంసం విక్రయిస్తూ జీవించే వృత్తాంతాన్ని తెలియజేసిన మహనీయుడు ఆరెకటిక గురువు ధర్మవ్యాధుడని, ఆయన సిద్ధాంతాలు ఆచరణీయమని సంఘం నాయకుడు కటికె గౌతమ్ అన్నారు. ఆదివారం గురుపౌర్ణమిని పురస్కరించుకుని గురువర ధర్మవ్యాధుడి చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. మహాకవి ఎర్రన రచించిన మహాభారతంలోని అరణ్య పర్వశేషంలో ధర్మవ్యాదోపాఖ్యానం ద్వారా ధర్మవ్యాధుడి మాంసం విక్రయిస్తూ జీవించే వృత్తాంతం తెలియజేస్తూ హింస, అహింస సిద్ధాంతాలను తెలియజేయాశారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 8 లక్షల ఆరెకటికల కుటుంబాలకు ప్రత్యేక ఫెడరేషన్, ఎస్సీ హోదాను ప్రకటించాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
- July 5, 2020
- Archive
- కర్నూలు
- AREKATIKA
- DHARMAVYADUDU
- ఆరెకటిక
- ధర్మవ్యాధుడు
- Comments Off on చిరస్మరణీయుడు.. ధర్మవ్యాధుడు