సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆఖండ భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వవిఖ్యాత తత్వవేత్త, గొప్పవ్యక్తి అని కొనియాడారు. వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పుల్లూరు గ్రామపెద్దలు చల్లా గిరిధర్ రెడ్డి, కలుగోట్ల పీఏసీఎస్ చైర్మన్ గజేందర్ రెడ్డి, సర్పంచ్ నారాయణమ్మ, ఎంపీటీసీ సభ్యులు వరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, పరమేశ్వర్రెడ్డి, శ్రీరామి రెడ్డి, టీచర్ వేణుగోపాల్, పుల్లూరు వివేకానంద యూత్ సభ్యులు, కలుగోట్ల శివాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
- January 12, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- GADWALA
- JOGULAMBA
- PULLURU
- VIVEKANADA
- జోగుళాంబ గద్వాల
- పుల్లూరు
- వివేకానంద
- Comments Off on ఘనంగా వివేకానంద జయంతి