![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/GOA-CMMMFF.jpg?fit=700%2C350&ssl=1)
పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ‘ నాకు లక్షణాలు ఏమీలేవు. కానీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. నేను ఇంట్లో నుంచి నా విధులను నిర్వర్తిస్తాను. దయచేసి నన్ను ఇటీవల కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండండి. లక్షణాలు ఉన్నా లేకపోయినా వెంటనే పరీక్షలు చేయించుకోండి. పాజిటివ్గా నిర్ధారణ అయితే ఆందోళన చెందకుండా చికిత్స తీసుకొండి. కరోనా తెలికగా తీసుకోవాల్సిన వ్యాధి ఏమీ కాదు. కానీ మరీ అంత ఆందోళన కూడా అవసరం లేదు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే కరోనా నుంచి కోలుకోవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.