![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/GOOGLE-COMPANYFF.jpg?fit=253%2C199&ssl=1)
న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేసేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులకు ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్ప్రంహోం విధానాన్ని మరిన్ని రోజులు పొడగించింది. జూలై 2021 వరకు తమసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్ప్రంహోంను పొడగిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులకు కోసం వర్క్ఫ్రం హోమ్ను పొడిగించిన తొలి కంపెనీ గూగుల్యే కావడం విశేషం. కాగా ఈ కంపెనీలో దాదాపుగా 2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.