Breaking News

ఖేల్​రత్న రేసులో శ్రీకాంత్

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక రాజీవ్గాంధీ ఖేల్​రత్న అవార్డు కోసం.. బాడ్మింటన్​ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదించింది. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన శ్రీకాంత్​.. క్షమాపణలు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అర్జున అవార్డుకు తన పేరును ప్రతిపాదించకపోవడంతో విమర్శలు చేసిన హెచ్ఎస్ ప్రణయ్​కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘ఫిబ్రవరిలో ఆసియా టీమ్ చాంపియన్​ షిప్​ సెమీస్ ఆడకుండా శ్రీకాంత్, ప్రణయ్ వేరే టోర్నీ కోసం బార్సిలోనా వెళ్లారు. జట్టును వీడిపోవద్దని చెప్పినా వినలేదు. దీంతో పతకం గెలిచే అవకాశాలను మేం కోల్పోయాం. అయితే బాయ్ కి పంపిన మెయిల్​లో శ్రీకాంత్ తన తప్పును ఒప్పుకున్నాడు. మరోసారి తప్పు చేయనని అంగీకరించాడు. అందుకే అతని పేరును ఖేల్​రత్నకు సిఫారసు చేశాం’ అని బాయ్ కార్యదర్శి అజయ్ సింఘానియా తెలిపాడు.