న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక రాజీవ్గాంధీ ఖేల్రత్న అవార్డు కోసం.. బాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదించింది. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన శ్రీకాంత్.. క్షమాపణలు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అర్జున అవార్డుకు తన పేరును ప్రతిపాదించకపోవడంతో విమర్శలు చేసిన హెచ్ఎస్ ప్రణయ్కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘ఫిబ్రవరిలో ఆసియా టీమ్ చాంపియన్ షిప్ సెమీస్ ఆడకుండా శ్రీకాంత్, ప్రణయ్ వేరే టోర్నీ కోసం బార్సిలోనా వెళ్లారు. జట్టును వీడిపోవద్దని చెప్పినా వినలేదు. దీంతో పతకం గెలిచే అవకాశాలను మేం కోల్పోయాం. అయితే బాయ్ కి పంపిన మెయిల్లో శ్రీకాంత్ తన తప్పును ఒప్పుకున్నాడు. మరోసారి తప్పు చేయనని అంగీకరించాడు. అందుకే అతని పేరును ఖేల్రత్నకు సిఫారసు చేశాం’ అని బాయ్ కార్యదర్శి అజయ్ సింఘానియా తెలిపాడు.
- June 20, 2020
- Archive
- క్రీడలు
- BADMINTON
- KHEL RATNA
- PRANAY
- SRIKANTH
- ఖేల్రత్న
- బాయ్
- Comments Off on ఖేల్రత్న రేసులో శ్రీకాంత్