![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/caroona-2-f-1.jpg?fit=351%2C400&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగా 730 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,802కు చేరింది. ఆదివారం 225 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 3,861 ఉన్నాయి. మొత్తం 3,731 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 659 కరోనా పాజిటివ్ కేసులు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. జనగామ జిల్లాలో 34 కేసులు, రంగారెడ్డి జిల్లా 10, మేడ్చల్ జిల్లాలో 9 చొప్పును కేసులు నమోదయ్యాయి.