![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/karan-joharrrrrf.jpg?fit=225%2C225&ssl=1)
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య.. బాలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. సుశాంత్ ఆత్మహత్యతో అతడి అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు సైతం బాలీవుడ్లో ఉన్న బంధుప్రీతిపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. బాలీవుడ్లో తీవ్రమైన బంధుప్రీతి ఉందంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. కొందరు సినీ ప్రముఖులను సోషల్మీడియాలో అన్ఫాలో చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు కరణ్జోహార్ తీవ్ర మనస్థాపంతో ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ పదవి నుంచి తప్పుకొన్నారు. సుశాంత్ మరణం తర్వాత తనపై భారీగా ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. సుశాంత్ మరణం తర్వాత ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, ఆలియాభట్ ఇంటర్వ్యూలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. తన కార్యక్రమంలో సుశాంత్ను కించపరిచే విధంగా ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్ అయ్యాయి. దీంతో అతడి అభిమానులు భారీ సంఖ్యలో కరణ్ అకౌంట్ నుంచి అన్ఫాలో అయ్యారు. మనస్థాపం చెందిన కరణ్ కొంతకాలంగా మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నేమామి ఫిల్మ్ ఫెస్టివల్ బోర్డు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకొన్న కరణ్ జోహర్ తన రాజీనామా లేఖను సంస్థ డైరెక్టర్ స్మృతి కిరణ్కు పంపినట్టు తెలిసింది