![కార్మికులను ఆదుకోవాలె](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/citu-2f.jpg?fit=682%2C239&ssl=1)
సారథి న్యూస్, రామగుండం: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకోవడానికి కార్మిక సంఘాలు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపులో భాగంగా ఆదివారం గోదావరిఖని చౌరస్తా లో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాయి. సీఐటీయూ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మెండ శ్రీనివాస్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి నరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. కరోనా కారణంగా నష్టపోతున్న ఆటో, లారీ, భవన నిర్మాణ, హమాలీ, క్వారీ తదితర రంగాల కార్మికులను ఆదుకోవాలని డిమాండ్చేశారు. ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, తోకల రమేష్, జి.సత్యనారాయణరెడ్డి, వెంకటస్వామి, ఎం.దుర్గయ్య, నంది నారాయణ, ఎన్.రాజేందర్, కె.ఎల్లయ్య పాల్గొన్నారు.