![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/dubai.jpeg?fit=1280%2C960&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో దుబాయిలో 250 మంది వర్కర్లకు శుక్రవారం నిత్యావసర సరుకుల పంపిణీ చేసినట్లు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలముల రమేష్ తెలిపారు. అజ్మాన్ లోని ఏ1 ఫారా కంపెనీలో ఆరునెలలుగా జీతాలు లేక, తినడానికి ఇబ్బందిపడుతున్న 250 మంది కార్మికులకు కొందరు సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. సరుకుల పంపిణీలో రవి ఉట్నూరి, షార్జా, అజ్మన్ కోఆర్డినేటర్ రవి డేవిడ్, సలహాదారులు లక్ష్మీరాజం, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంగాధర్ పాల్గొన్నారు.