![కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/check.jpeg?fit=1280%2C853&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో పది మంది లబ్ధిదారులకు రూ.10,01,160 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మి, స్థానిక సర్పంచ్ పంజాల ప్రమీల, సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, పలు గ్రామా సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.