Breaking News

కరోనాపై నిర్లక్ష్యం తగదు

సారథిన్యూస్​, మహబూబాబాద్​: ప్రైవేట్​ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలను ఉచితంగా చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య డిమాండ్​ చేశారు. అవసరమైతే ప్రైవేట్​ ఆస్పత్రులను ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. కరోనా టెస్టుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. కరోనా టెస్టుల్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ఆయన మహబూబాబాద్​లోని పెరుమాండ్ల భవన్​లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటింటికి కరోనా టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.