![కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/cpm-2-2.jpg?fit=1029%2C313&ssl=1)
సారథి న్యూస్, కోదాడ : రాష్ర్టంలో కరోనా విస్తరణ రోజురోజుకు పెరిగిపోతుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కుక్కడపు ప్రసాద్ అన్నారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, వైరస్ బారిన పడిన పేదవారు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స చేయించుకోలేక పోతున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ బుధవారం కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆ పార్టీ నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెల్ది పద్మావతి, ఎం.ముత్యాలు, నాగరాజు, జె.సాయి కుమార్, దేవరాజు పాల్గొన్నారు.