![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/VASANTH-KUMARRFFG.jpg?fit=700%2C394&ssl=1)
చెన్నై: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్నది. తాజాగా ఓ ఎంపీని బలితీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ఎంపీ వసంత్కుమార్ (70) శుక్రవారం కరోనాతో కన్నుమూశారు. కరోనా లక్షణాలతో ఆగస్టు 10న వసంత్కుమార్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా, ఆయన ఆరోగ్యం విషమించి శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఆయన మృతికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ సంతాపం తెలిపారు. వసంత్కుమార్ మృతి కాంగ్రెస్ తీరని లోటని వారు వ్యాఖ్యానించారు. తమిళనాడులో కాంగ్రెస్ బలోపేతానికి ఆయన ఎంతో కృషిచేశారని పేర్కొన్నారు.