Breaking News

కరోనా బాధితుల ఇంటికి సీల్​

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకున్నది. కరోనా నిర్ధారణ అయిన రోగుల ఇండ్లను మున్సిపల్​ సిబ్బంది మెటల్​తో సీలు చేశారు. బెంగళూరులోని ఓ అపార్ట్​మెంట్​లో ఉంటున్న రెండు కుటుంబాలవారికి కరోనా సోకింది. దీంతో మున్సిపల్​ సిబ్బంది వారి ఇండ్ల తలుపులకు ఇనుప రేకులను బిగించి వాటిని మేకులతో కొట్టి బిగించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఓ వ్యక్తి సోషల్ ​మీడియాలో పోస్ట్​ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై సోషల్ ​మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో బీబీఎంపీ (బృహత్​ బెంగళూరు మహానగర్​ పాలిక) కమిషనర్​ ముంజునాథ ప్రసాద్​ క్షమాపణ చెప్పారు. ఇంటికి వేసిన సీల్​ను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.

One thought on “కరోనా బాధితుల ఇంటికి సీల్​”

Comments are closed.