Breaking News

కరోనా పేషెంట్ల కోసం హాస్పిటల్.. భేష్​

కరోనా పేషెంట్ల కోసం హాస్పిటల్.. భేష్​

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. బుధవారం హైదరాబాద్​లోని మాదాపూర్​లో సిగ్మా హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో నిష్ణాతులైన వైద్యుల బృందం ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లు కోసమే ప్రత్యేకంగా హాస్పిటల్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు.

ఆస్పత్రిలోని ఐసీయూ విభాగాన్ని బుద్ధవనం ప్రాజెక్టు స్పెషలాఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించారు. ఆస్పత్రిలో 50 పడకలు ఉన్నాయని, అందులో 12 పడకలకు వెంటిలేటర్స్ సపోర్టు ఉందన్నారు. తమ హాస్పిటల్​లో అత్యాధునిక ల్యాబ్​సౌకర్యం ఉందని డైరెక్టర్లు డాక్టర్ సురేష్ చంద్ర, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ సంతోష్ రావు మంత్రికి వివరించారు.