Breaking News

కరోనా తగ్గింది..

కరోనా తగ్గింది..

సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న పకడ్బందీ చర్యల ఫలితంగా రాష్టంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని సీఎం రాజకీయ కార్యదర్శి, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి అన్నారు.

మంగళవారం మెదక్ జిల్లా హవేళి ఘనపూర్​ మండలం కూచన్​పల్లిలో సొంతంగా తయారుచేయించిన మాస్క్ లు, శానిటైజర్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్ ను పూర్తిగా నివారించే వరకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరించాలని అన్నారు.

అందరూ ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరంగా బయటకు రావాల్సి వస్తే సోషల్​ డిస్టెన్స్​ పాటించి మాస్క్ లు ధరించాలన్నారు. ప్రభుత్వ చర్యలతో కొత్త కేసుల నమోదు బాగా తగ్గిందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్ దేవాగౌడ్​, డీఆర్​డీవో శ్రీనివాస్, డీఎంహెచ్ వో డాక్టర్​ వెంకటేశ్వర్లు, డీఎల్పీవో జ్యోతి రెడ్డి, ఎంపీడీవో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.