Breaking News

ఓయూ భూముల రీసర్వే చేయండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) భూములను రీసర్వే చేయించి భూ కబ్జాదారులు నుంచి కాపాడాలని టీఆర్​ఎస్​వీ రాష్ట్ర అధ్యక్షుడు గేల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నాయకులు జీహెచ్​ఎంసీ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు శనివారం వినతిపత్రం అందజేశారు. వేలమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ.. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఓయూ భూములను కాపాడాలని వారు కోరారు.