![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/krm2.jpg?fit=1073%2C734&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఉత్సాహంగా సాగుతోంది. ఆదివారం సర్పంచ్ ప్రమీల, ఉపసర్పంచ్ రాజేందర్, పంచాయతీ కార్యదర్శి జ్యోతితో పాటు పాలకవర్గ సభ్యులు వివిధ వార్డులను సందర్శించి పారిశుద్ధ్యం తీరును తెలుసుకున్నారు. కార్యక్రమంలో సముద్రాల శ్రీను, నీలం రవి, సుబద్ర, మాజీ సర్పంచ్ పంజాల జగన్మోహన్, మామిడి కుమార్, పెందోట రాజు, మామిడి అంజయ్య పాల్గొన్నారు.