Breaking News

అన్నదాతలు ఆత్మగౌరవంతో బతకాలి

  • మంత్రి హరీశ్​రావు

సారథి న్యూస్​, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలనే నియంత్రత వ్యవసాయ విధానాన్ని అమలుచేస్తున్నామని మంత్రి హరీశ్​ రావు ప్రకటించారు. శనివారం ఆయన సాగు విధానంపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వానాకాలంలో రైతుబంధు కింద ఇచ్చేందుకు ఇప్పటికే రూ.ఏడువేల కోట్లలో రూ.3500 కోట్ల ను వ్యవసాయశాఖ ఖాతాలోకి జమచేశామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 20వేల మందికిపైగా రైతులకు ఓకే విడత రుణమాఫీ చేశామన్నారు. అగ్రికల్చర్​ అధికారులు వ్యవసాయ ప్రణాళికను తయారుచేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.