Breaking News

‘అథ్లెటిక్స్’​ సెమినార్​లో స్వాములు ప్రతిభ

‘అథ్లెటిక్స్’​సెమినార్​లో స్వాములు ప్రతిభ

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఎస్ఏఏఎఫ్) ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ) ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన ‘టెక్నికల్ అఫీషియల్’ ఆన్ లైన్ సెమినార్, మే 18 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన ‘స్టార్టర్స్’ ఆన్ లైన్ సెమినార్ లో గురుకులాల అసిస్టెంట్​స్పోర్ట్స్ ఆఫీసర్, నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు పాల్గొన్నారు. సెమినార్​లో ప్రతిభ చూపినందుకు గాను ఆయనకు నిర్వాహకులు ప్రశంసాపత్రం అందజేయగా.. ఈ మేరకు ఆయన గురుకులాల కార్యదర్శి డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​నుంచి అందుకున్నారు. అసోసియేషన్ నాయకులు పరశురామ్, కోశాధికారి శ్రీను యాదవ్, శివ, స్వేరోస్​ నాగర్​కర్నూల్ ​జిల్లా కమిటీ తరఫున డి.నాగేష్, పీఈటీ పి.అంజి, జి.విజయ్​కుమార్, భీముడు, జి.బాల్​జంగయ్య, కాటిక రామస్వామి, పాలెపు కొండల్, ఎండీ తురాబ్, కొమ్ము కృష్ణ, అలాగే బీఎస్పీ నాగర్​ కర్నూల్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండి పృథ్వీరాజ్, వర్కాల ధనుంజయ్, తోకల కృష్ణయ్య, పవన్​ తదితరులు​ అభినందనలు తెలిపారు.