ప్రముఖ సినీనటి, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున సతీమణి అమల రైతులకు సాయమందించి ఔదార్యం చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామంలో ఆరువందల యాభై మంది రైతులకు అమల అక్కినేని ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు సుమారు నాలుగు కిలోల చొప్పున విత్తనాలు అందజేశారు. రైతులు సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని సూచించారు. అందుకు రైతులు ఆసక్తి చూపితే శాస్త్రవేత్తలను పిలిచి అవగాహన కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తామన్నారు. కష్ట సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తమకు తోచిన విధంగా సహాయం చేయడానికి అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. బ్లూ క్రాస్ సోసైటీ కో ఫౌండర్గా వ్యవహరిస్తున్న అమల అక్కినేని మూగజీవాలకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే.
- June 14, 2020
- Archive
- సినిమా
- AMALA AKKINENI
- DISTRIBUTION
- Farmers
- NAGARJUNA
- బ్లూ క్రాస్ సోసైటీ
- మూగజీవాలు
- Comments Off on అక్కినేని అమల.. ఔదార్యం