![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/sama-2F.jpg?fit=200%2C300&ssl=1)
కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాత్తు వాక్కుల్ ఇరెండు కాదల్’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన ఇద్దరు హీరోయిన్లలో ఒకరు నయనతార కాగా, మరొక హీరోయిన్ సమంత చేస్తుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్పైకి రానుంది. ఈ చిత్రాన్ని లోబడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితులే అందుకు కారణమట. అంతేకాదు నిర్మాతలకు భారం కాకుండా ఉండేందుకు సమంత కూడా తన రెమ్యునరేషన్ తగ్గించిందని సమాచారం. ఈ యేడు ‘జాను’ సినిమాలో నటించిన.. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. సమంత టాలీవుడ్లో మరే ప్రాజెక్టుపై సైన్ చేసినట్టు అధికారక ప్రకటనేమీ ఇంకా రాలేదు.