Breaking News

ఏడుపాయల భక్తజన సంద్రం

ఏడుపాయల భక్తజన సంద్రం

  • వైభవంగా ప్రారంభమైన జాతర మహోత్సవం
  • పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి, ఎమ్మెల్యేలు

సారథి న్యూస్, పాపన్నపేట: మహాశివరాత్రి పర్వదినం రోజున పవిత్ర మంజీరా నది పాయల మధ్య వనదుర్గామాత సన్నిధిలో ఏడుపాయల జాతర గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఓ వైపు శివనామస్మరణ, మరోవైపు దుర్గమ్మ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. గురువారం తెల్లవారుజామున పూజారులు అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ, అర్చనలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యే లు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, కలెక్టర్ హరీశ్​తో కలిసి వన దుర్గా మాత కు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం మంజీరా నది పాయ మధ్యలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి టి.హరీశ్​రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తూ జాతరను ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. మున్ముందు ఏడుపాయల మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

వనదుర్గమ్మ ఆలయ ప్రాంగణం
ఏడుపాయల వనదుర్గమాత