![మహిళల హక్కులకు రక్షణ కల్పించాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/03/VJ33F.jpg?fit=184%2C250&ssl=1)
సారథి న్యూస్, ములుగు: మహిళల హక్కులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఏకలవ్య ఎరుకల గిరిజన హక్కుల పరిరక్షణ సాధన సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు పాలకుర్తి విజయ్ కుమార్ కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలపై రాష్ట్ర నలుమూలల ఎక్కడో ఒకచోట ప్రతిరోజు హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.