Breaking News

ఎస్టీయూ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

ఎస్టీయూ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

సారథి న్యూస్, ములుగు: జిల్లాలోని ఎస్టీయూ భవన్ లో జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనియన్​ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వతరెడ్డి హాజరయ్యారు. దేశంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా కొనియాడే సంప్రదాయం ఉందని, అయినా మహిళలు వివక్షకు గురవుతున్నారని అన్నారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా అందించే సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు ఉపాధ్యాయినులు సుమలత, సునిత, సుధారాణి, లవనిక, లలిత, రాజేశ్వరిని అవార్డులతో సత్కరించారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సోలం క్రిష్ణయ్య, హైదరాబాద్ ఎస్టీయూ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఇనగాల సూర్యనారాయణ, ములుగు మండల శాఖ అధ్యక్షుడు గన్నోజు ప్రసాద్, ప్రధానకార్యదర్శి కంది రఘుపతి, వెంకటాపూర్ మండల శాఖ అధ్యక్షుడు బండారి జగదీష్, గోవిందరావుపేట్ అధ్యక్షుడు పోరిక రాజన్న, మంగపేట్ ప్రధానకార్యదర్శి జుమ్మిలాల్, కన్నాయిగూడెం అధ్యక్షురాలు సుమలత, తాడ్వాయి బాధ్యులు సతీష్, శిరుప సతీష్, పార్వతి, సుజాత, శాంత పాల్గొన్నారు.