Breaking News

కొట్రలో ఘనంగా వివేకానందుని జయంతి

కొట్రలో వివేకానందుని జయంతి

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో స్థానిక యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ ఆఫీసు వద్ద వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ యువ నాయకులు కావటి దశరథం మాట్లాడుతూ.. వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేశారని గుర్తుచేశారు. ఆఖండ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజెప్పారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పొనుగోటి విష్ణువర్ధన్​రావు, జగన్, కుమార్, సుప్రీం టైలర్​జి.నిరంజన్, తిరుపతయ్య, కొండల్​తదితరులు పాల్గొన్నారు.