![పచ్చిరొట్ట ఎరువులను వాడండి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/05/nzpt1f.jpg?fit=655%2C281&ssl=1)
సారథి, రామాయంపేట: పచ్చిరొట్ట ఎరువులను వాడటం ద్వారా భూసారం పెరుగుతుందని రామయంపేట ఏడీఏ వసంత సుగుణ అన్నారు. శుక్రవారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చిరొట్ట ఎరువులు నిజాంపేట ఆగ్రోస్ రైతుసేవా కేంద్రంలో 65శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు 150 బస్తాలు, జనుము 112 బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులంతా సద్వినియోగం ఆమె కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సతీష్, ఏఈవోలు గణేష్ కుమార్, దివ్యశ్రీ, ఆగ్రోస్ నిర్వాహకులు రంజిత్ పాల్గొన్నారు.