![రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/25HSB09.jpg?fit=1280%2C853&ssl=1)
- ప్రజలకు సూచించిన మంత్రి హరీశ్ రావు
సామాజి సారథి, ములుగు: మొదటి డోస్ వేసుకున్నంత వారంతా తప్పనిసరిగా రెండవ డోస్ వేయించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు క్షీరసాగర్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్ రెడ్డి వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేయడం అభినందనీయమని ప్రశంసించారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం, కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ అండ్ కూల్ వాటర్ ప్లాంట్ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్షీరసాగర్ గ్రామస్తులంతా కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ వేసుకున్నారా..? అంటూ ఆరాతీశారు. తప్పనిసరి వేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. ఎంపీటీసీ బాల్ రెడ్డి సొంత నిధులతో చేపడుతున్న అభివృద్ధి అభినందనీయమైందన్నారు. గ్రామంపై బాల్ రెడ్డికి ఉన్న మమకారం ప్రేమ వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు.