సారథి, ధరూర్: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ జూరాలకు పరుగులు తీస్తోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో జూరాల అందాలను తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. స్నేహితుల దినోత్సవం కావడంతో జూరాల పరిసరాల్లో ఫోన్లలో సెల్ఫీ ఫొటోలు దిగుతూ తమ ఆనందం పంచుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చినవారు పక్కనే ఉన్న చేపల వంటకాన్ని రుచిచూచి సేదతీరి తిరుగు పయనమయ్యారు.
- August 1, 2021
- Archive
- Top News
- JURALA
- KRISHNA RIVER
- SRISAILAM
- కృష్ణానది
- జూరాల
- శ్రీశైలం
- Comments Off on జూరాలకు సందర్శకుల తాకిడి