Breaking News

టీఆర్ఎస్ లో పలువురి చేరిక

టీఆర్ఎస్ లో పలువురి చేరిక

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలం దానంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ ఉపసర్పంచ్ కొడుకు కట్ట శంకర్, పంచాయతీ కోఆప్షన్ సభ్యుడు పుట్ల బేతయ్య, కట్ట చిన్నరవి, కట్ట వెంకయ్య, కట్ట లింగయ్య, నర్సింగ్, శివకుమార్, సాయిలు, యాదయ్య, యాదమ్మ, శ్రీకాంత్, దుర్గయ్య, గంగయ్య సతీష్ తో పాటు పలువురు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మురళీపంతులు, ఎంపీపీ జంగం శ్రీనివాస్, కట్ట భాగయ్య పాల్గొన్నారు.