Breaking News

దుమ్ము రేగుతోంది..

దుమ్ము రేగుతోంది..

  • వేములవాడ టౌన్​లో మిషన్ ​భగీరథ కోసం తవ్విన రోడ్లు
  • రోడ్లపైనే మట్టి.. వాహనదారులకు ఇబ్బందులు
  • ఇంట్లోకి వస్తున్న దుమ్ము.. ఊపిరిపీల్చుకునేందుకు కష్టం

సారథి, వేములవాడ: పేరుకే సిమెంట్​ రోడ్లు.. చూస్తే మట్టిరోడ్లను తలపిస్తున్నాయి. వేములవాడ పట్టణంలోని మిషన్ భగీరథ పనుల పేరుతో రోడ్లను తవ్వి మట్టిని వదిలేస్తున్నారు కాంట్రాక్టర్లు. మిషన్ భగీరథ పైపు లైన్ కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేశారు. అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. పైగా ఈ రోడ్లపై వాహనాలు వెళ్తుంటే దుమ్మ రేగుతోంది. అసలే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంతో ప్రజలంతా భయపడి ఇంటికే పరిమితమయ్యారు. ఈ తరుణంలో దుమ్ము ఇంట్లోకి రావడంతో శ్వాసతీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఇకనైనా వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ తమ ఇబ్బందులను అర్థం చేసుకుని రోడ్లను బాగు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్లపై ఉన్న మట్టిని తొలగించాలని డిమాండ్ ​చేస్తున్నారు.