![కాంగ్రెస్నేతల అరెస్ట్సరికాదు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/07/vmd-5.jpg?fit=367%2C229&ssl=1)
సారథి, వేములవాడ: టీపీసీసీ చీఫ్ఎనుముల రేవంత్ రెడ్డి తలపెట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కాంగ్రెస్మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా నేతృత్వంలో తరలివెళ్తున్న వారిని శుక్రవారం కోనరావుపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ.. పోలీసుల పహారాలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నిరోజులు రాజ్యమేలుతారో చూద్దామని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను ఎంత మందిని నిర్బంధించినా ప్రజల కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. నాయకుల అక్రమ అరెస్ట్లు సరికాదన్నారు. అరెస్ట్అయిన వారిలో నాయకులు బోయిని దేవరాజు, గుండెల్లో ఎల్లయ్య యాదవ్ ఉన్నారు. అనంతరం వారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.