Breaking News

కాంగ్రెస్ ​నేతల అరెస్ట్​ సరికాదు

కాంగ్రెస్​నేతల అరెస్ట్​సరికాదు

సారథి, వేములవాడ: టీపీసీసీ చీఫ్​ఎనుముల రేవంత్ రెడ్డి తలపెట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కాంగ్రెస్​మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా నేతృత్వంలో తరలివెళ్తున్న వారిని శుక్రవారం కోనరావుపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ ​చేశారు. ఈ సందర్భంగా షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ.. పోలీసుల పహారాలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నిరోజులు రాజ్యమేలుతారో చూద్దామని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను ఎంత మందిని నిర్బంధించినా ప్రజల కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. నాయకుల అక్రమ అరెస్ట్​లు సరికాదన్నారు. అరెస్ట్​అయిన వారిలో నాయకులు బోయిని దేవరాజు, గుండెల్లో ఎల్లయ్య యాదవ్ ఉన్నారు. అనంతరం వారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.