![వేంకటేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2022/02/ngkl.jpg?fit=655%2C310&ssl=1)
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు, యువనేత డాక్టర్ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పలు శుభకార్యాల్లో ఆదివారం విస్తృతంగా పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ లోని ముఖ్యకార్యకర్తలతో కలిసి తాడూరు మండల కేంద్రంలోని బొడ్రాయి పండుగలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నాగర్ కర్నూల్, తెలకపల్లి గ్రామాల్లో కార్యకర్తల పిలుపుమేరకు పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. అనంతరం బిజినేపల్లి మండలంలోని పాలెం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్కడ ఏర్పాటుచేసిన వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఆలయ చైర్మన్ శేఖర్ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి రంగారావు పలువురు ఆయనకు పూలమాలలతో శాలువా కప్పి సన్మానించారు. అనంతరం అక్కడి నుంచి మొక్కులు చెల్లించుకుని కార్యకర్తలతో కలిసి నాగర్ కర్నూల్ లోని ఆయన స్వగృహానికి వెళ్లారు.