Breaking News

కరోనా బాధితురాలికి ఆశ్రయం

కరోనా బాధితురాలికి ఆశ్రయం

సారథి, రామడుగు: మానవత్వం ఇంకా బతికే ఉందన్నదానికి ఈ సాయమే నిదర్శనం. కరోనా బాధితురాలిని అద్దె ఇంట్లో నుంచి గెంటివేస్తే వారికి ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకున్నారు ఓ మంచి మనిషి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటలో కరోనా బారినపడిన కుటుంబానికి అద్దెకు ఇచ్చిన యజమాని తమ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. వెంటనే ఆ కుటుంబానికి సర్పంచ్ సత్యప్రసన్న చేయూత ఇచ్చారు. రెండ్ల మల్లేశం ఆ కుటుంబ పరిస్థితిని వారికి తీసుకుపోవడంతో నిర్మాణదశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇంటిలో కరెంట్, నీళ్లు అన్నిరకాల సౌకర్యాలు సమకూర్చారు. అలాగే ఖర్చులకు రూ.ఐదొందలను చేతిలో పెట్టి ధైర్యం చెప్పారు. రెండ్ల మల్లేశం, జీపీ సిబ్బంది గోపాల్ రెడ్డి, మల్లయ్య, కారోబార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.