![శ్యాంప్రసాద్ ముఖర్జీ మహోన్నత దేశభక్తుడు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/06/cpd-bjp.jpg?fit=655%2C331&ssl=1)
సారథి, చొప్పదండి: జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి(బలిదాన్ దివాన్) సందర్భంగా బుధవారం కరీంనగర్జిల్లా చొప్పదండి పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ చొప్పదండి పట్టణ ఇన్చార్జ్దాసరి రమణారెడ్డి మాట్లాడుతూ.. దేశసమైక్యత, సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడని కొనియాడారు. దేశసమున్నత, సమైక్య భారత్ కోసం పోరాటం చేసిన మహోన్నత దేశభక్తుడని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మంచికట్ల మల్లేష్, గుర్రం సమర్, పట్టణ ప్రధానకార్యదర్శులు బత్తిని ప్రశాంత్, గుండేటి వెంకటరమణ, బీజేవైఎం పట్టణాధ్యక్షుడు తాడూరి శివకృష్ణ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సిరిపురం శ్రీనివాస్, జోంగోని తిరుపతి, ఊదరి మధు, గంగు సంపత్, జాగిరి రాజేందర్ పాల్గొన్నారు.