Breaking News

బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని తాటివనానికి పోయేందుకు రోడ్డు మీద బ్రిడ్జి నిర్మించాలని గౌడకులస్తులు ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కు క్యాంపు ఆఫీసులో బుధవారం వినతిపత్రం ఇచ్చారు. స్థానిక ఎల్లమ్మ, సమ్మక్క సారలమ్మ దేవాలయాలు, రామడుగు తాటి వనంలో ఉండడంతో గౌడ కులస్తులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. రోడ్డుమధ్యలో వాగు ప్రవహిస్తూ వర్షాల సమయంలోనూ నారాయణ పూర్ రిజర్వాయర్ నీరు విడుదల చేసినప్పుడు వరద ఉధృతికి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాజీ సర్పంచ్ పంజాల జగన్ మోహన్, సంఘం అధ్యక్షుడు అనుపురం తిరుపతి, పొన్నం అంజయ్య, అనుపురం రాజేశం, శ్రీను, రాజయ్య గోనపల్లి లచ్చయ్య, రాజయ్య, రాజమల్లు, పురేళ్ల రవీందర్ ఉన్నారు.