Breaking News

మోడీ స్టేడియంలో రికార్డుల మోత

మోడీ స్టేడియంలో రికార్డుల మోత

అహ్మదాబాద్‌: మోతేరా స్టేడియంలో రికార్డుల మోత మోగింది. స్పిన్‌ బౌలింగ్​కు అనుకూలిస్తున్న పిచ్‌పై మన స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లండ్‌కు దారుణ ఓటమి తప్పలేదు. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య గుజరాత్​లోని అహ్మదాబాద్(మోతేరా) ​నరేంద్రమోడీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన డే అండ్​ నైట్ ​పింక్ ​బాల్ ​మూడవ టెస్ట్​మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్​జట్టును టీమిండియా 112 పరుగులకే ఆలౌట్​చేసింది. అనంతరం బ్యాటింగ్​చేపట్టిన భారత జట్టు 145 పరుగులు చేయగలిగింది. ఓపెనర్​రోహిత్​శర్మ 66 పరుగులు చేశాడు. అక్సర్​పటేల్​6 వికెట్లు తీశాడు. అశ్విన్​3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ 5 వికెట్లు తీశాడు. ఇక ఇంగ్లండ్​జట్టు రెండవ ఇన్నింగ్స్​లో 81 పరుగులకే ఆలౌట్​అయింది. దీంతో 49 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. స్టోక్స్​25 పరుగులతో టాప్​స్కోరర్​గా నిలిచాడు. రూట్​19 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అక్షర్​పటేల్​5, అశ్విన్​4, సుందర్​ఒక వికెట్​చొప్పున తీశారు. రెండవ ఇన్సింగ్స్​లో 49 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7.4 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఈ సిరీస్‌లో టీమిండియా జట్టు 2-1తో ఆధిక్యం సాధించింది. అక్సర్​ పటేల్ మ్యాన్ ​ఆఫ్​ది మ్యాచ్​గా నిలిచాడు.