Breaking News

ప్రజా నాయకుడు హరీశ్ రావు

ప్రజా నాయకుడు హరీశ్ రావు

సారథి, సిద్దిపేట: ప్రజా నాయకుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత అన్నారు. గురువారం మంత్రి జన్మదిన వేడుకలను హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ కాసర్ల అశోక్ బాబు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, మాజీ జడ్పీటీసీ మాలోత్ బీలునాయక్, కోఆప్షన్ సభ్యులు ఐయిలేని శంకర్ రెడ్డి, ఎండి. ఆయూబ్, లక్ష్మణ్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి, ఎండ అన్వర్, కోడముంజ రమేష్, బండి రమణరెడ్డి, బోజు రవీందర్,పార్టీ ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.