![ప్రైవేట్టీచర్లను ఆదుకోవాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/08/cpd1.jpg?fit=230%2C277&ssl=1)
సారథి, చొప్పదండి: ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని అసోసియేషన్అధ్యక్షుడు మాచర్ల మహేశ్ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. సోమవారం కరీంనగర్జిల్లా చొప్పదండి ఆకాశ్ పబ్లిక్ స్కూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి 18 నెలలు అవుతోందని, ప్రైవేట్ఉపాధ్యాయులు మానసికంగా కృంగిపోయారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.2వేల ఆర్థిక సాయం, 25 కేజీల బియ్యం కొంత స్వాంతన కలిగించిందన్నారు. కానీ ప్రభుత్వం మూడునెలలకే ఆ సహాయాన్ని నిలిపివేసిందన్నారు. ప్రీ ప్రైమరీ టీచర్లు, ప్రైమరీ టీచర్లకు జీవనోపాధి లేక వారి బతుకుదెరువు అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి స్కూళ్లను పూర్తిగా తెరిచేవరకు ఈ ఆర్థిక సహాయాన్ని కొనసాగించాలని కోరారు.