Breaking News

పోలింగ్ కేంద్రం పరిశీలన

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలన

సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలానికి  ఈనెల 10న జరగనున్న పోలింగ్ సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను, పోలింగ్ కేంద్రాన్ని  ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య సోమవారం జిల్లా ఎన్నికల అధికారి హరీష్, సహాయ ఎన్నికల అధికారి రమేష్ తో కలిసి పరిశీలించారు.  స్ట్రాంగ్ రూమ్ కు ఉన్న కిటికీలను ప్లయి ఉడ్ తో పూర్తిగా మూసివేయాలని, కళాశాలో ఉన్న 4సీసీ కెమెరాలను పరిశీలించి అదనంగా మరో రెండు కెమెరాలను బ్యాక్ సైడ్, ప్రక్కన ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారికి సూచించారు.  అవసరమైన మేరకు బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాహసీల్దార్ భానుప్రసాద్, హైస్కూల్ హెడ్ మాస్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.